Header Banner

జీ7 సదస్సు వేళ కలకలం..! కెనడాలో చిన్నారులను రెచ్చగొడుతున్న ఖలిస్థానీలు!

  Tue Jun 17, 2025 10:00        Others

కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు ప్ర‌ధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఖలిస్థానీ వేర్పాటువాదులు తమ భారత వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో చిన్నారులను అడ్డం పెట్టుకుని భారత జాతీయ పతాకాన్ని అవమానించడం, ప్రధాని మోదీ చిత్రపటాలపై దాడులు చేయించడం వంటి దారుణమైన చర్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఓ ఖలిస్థానీ ఉగ్రవాది ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్ర బెదిరింపులకు దిగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు కొందరు ఆరుగురు చిన్నారులను రెచ్చగొట్టి, భారత జాతీయ జెండాను అపవిత్రం చేయించడంతో పాటు, ప్రధాని మోదీ చిత్రపటాలను కాళ్లతో తన్నేలా ప్రోత్సహించినట్లుగా ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ దృశ్యాలలో పెద్దలు కొందరు కెమెరాకు దూరంగా ఉంటూ పిల్లలను ఈ దిగజారుడు చర్యలకు ఉసిగొల్పడం స్పష్టంగా కనిపించింది. తమ మత, రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఇస్లామిస్టులు మహిళలు, చిన్నారులను వినియోగించుకునే పద్ధతులను ఖలిస్థానీలు అనుసరిస్తున్నారని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.

భారతీయ సిక్కుల తీవ్ర ఖండన
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు చిన్నారుల మనసుల్లో విషబీజాలు నాటి, వారిని విద్వేష ప్రచారానికి వాడుకోవడాన్ని భారతీయ సిక్కులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ సీనియర్ నేత మంజిందర్ సింగ్ సిర్సా పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. "కెనడాలో సిక్కు చిన్నారులతో విద్వేషపూరిత చర్యలు చేయిస్తున్న ఘటనలు చూసి ప్రతి సిక్కు తీవ్ర ఆవేదన, సిగ్గుతో తలదించుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న పిల్లలను తాలిబన్ల ప్రచారాన్ని తలపించేలా వాడుకోవడం దిగ్భ్రాంతికరం.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
 

ఇది సిక్కు చిన్నారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, వారిలో ద్వేషాన్ని నింపి, సిక్కులను తీవ్రవాదులుగా చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా సిక్కుల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది గురు గ్రంథ్ సాహిబ్ జీ బోధనలకు, మానవత్వ సేవ, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అనే సిక్కు మత మౌలిక సూత్రాలకు పూర్తిగా విరుద్ధం" అని అన్నారు.

ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు మనిందర్జీత్ సింగ్ బిట్టా మాట్లాడుతూ, "విదేశాల్లో మన ప్రధానమంత్రిని దూషిస్తున్నప్పుడు భారత సిక్కు సమాజం మొత్తం ఎందుకు మౌనంగా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ రోజు జరుగుతున్న అనేక విషయాలు, ముఖ్యంగా పిల్లలు చేస్తున్న పనులు వారికి అర్థం కావు అనుకుంటున్నాను. కాబట్టి ఏం జరుగుతుందో వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత పెద్దలు, వారి కుటుంబాలపై ఉంది. జరిగింది నిజంగా దురదృష్టకరం" అని అన్నారు.

ప్రధాని మోదీకి ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి బెదిరింపులు
మంజీందర్ సింగ్ అనే ఖలిస్థానీ ఉగ్రవాది భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన మరో వీడియో కూడా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ప్రచారంలోకి వచ్చింది. "అవును, నేను మోదీ రాజకీయాలను అంతం చేయడానికి, మోదీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కెనడా శత్రువు, ఈ హిందూ ఉగ్రవాది నరేంద్ర మోదీ" అని అతను చెప్ప‌డం ఆ వీడియోలో ఉంది. కాల్గరీలోని గురుద్వారా దష్మేశ్ నుంచి బయలుదేరిన కాన్వాయ్‌కు మంజీందర్ సింగ్ నాయకత్వం వహించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #G7Summit #KhalistanIssue #CanadaControversy #ChildProvocation #InternationalTensions #G7News #KhalistanProtest